Saturday, May 4, 2024

ఎపిలో దారుణం.. కుటుంబాన్నే మింగేసిన కరోనా మహమ్మారి..

- Advertisement -
- Advertisement -

కరకు కరోనా ఎంత పనిచేసింది…
ఓ కుటుంబంలో నలుగురిని మింగేసింది

3 of Family suicide after jump into Godavari River in AP

అమరావతి: కనిపించని మహమ్మారి కరోనా దారుణాలనే చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నర్సయ్య కుటుంబంలో ఒక్కరూ కూడా మిగలకుండా 2020 కాలగర్భంలో కలిసిపోయింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో నివసించే కుటుంబ పెద్ద నరసయ్య ఈ నెల 16న కరోనా తీవ్రతతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కరోనాతో కుటుంబ పెద్ద చనిపోవడం, కనీసం తమను పరామర్శించేందుకు కూడా ఎవరూ రాకపోవడం, బంధువులు కూడా ముఖం చాటేయడంతో ఈ కుటుంబం తీవ్రంగా ఆవేదన చెందింది. బతకడం అనవసరం అనుకున్నట్లుగా ఈ కుటుంబంలో మిగిలిన వారు సమీపంలోనే ఉన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసయ్య భార్య సునీత(50), కుమారుడు ఫణికుమార్(25), కుమార్తె అపర్ణ(23) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని విచారిస్తున్నారు.

3 of Family suicide after jump into Godavari River in AP

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News