ప్రముఖ సింగర్ సునీతకు కరోనా వైరస్ సోకినట్లు స్వయనా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం తనకు స్వల్పంగా తలనొప్పి రావడంతో టెస్టు చేపించుకోగా పాజిటివ్ తేలినట్లు ఆమె చెప్పారు. అయితే వైద్యుల సూచనల మేరకు తాను చికిత్సను తీసుకున్నానని, తగిన జాగ్రత్తలతో వైరస్ను ఎదుర్కొంటున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఈమెతో పాటు మరో మహిళ సింగర్కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. కానీ అధికారికంగా సమాచారం లేదు. మరోవైపు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కొడుకు చరణ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన తండ్రి వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, తప్పుడు వార్తలను నమ్మొద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Singer Sunitha tests positive for Corona