Monday, May 6, 2024

అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్షకు 308 ఖైదీలు హాజరు

- Advertisement -
- Advertisement -

308 prisoners appear for Ambedkar varsity qualifying examination

 

మనతెలంగాణ/హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 8,971 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అర్హత పరీక్షకు వివిధ జైళ్ల నుంచి 308 ఖైదీలు హాజరయ్యారు. చెర్లపల్లి జైలు నుంచి 105 మంది, వరంగల్- 38, రాజమండ్రి -73, కడప – 59, నెల్లూరు – 33 మంది ఖైదీలు పరీక్షల రాశారు. విశ్వవిద్యాలయ ఇంఛార్జి అకాడమిక్ డైరెక్టర్ ఇ. సుధారాణి, ఇంచార్జ్ రిజిస్ట్రార్ జి. లకా్ష్మ రెడ్డిలు ఖైరతాబాద్ డిగ్రీ కళాశాల, బేగంపేటలోని మహిళా కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు.ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 2020-21 సంవత్సరంలో బిఎ, బి.కాం, బిఎస్‌సి కోర్సులలో ప్రవేశం పొందవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News