Sunday, May 5, 2024

నేపాల్‌లో నదిలో పడ్డ బస్సు

- Advertisement -
- Advertisement -
32 dead in bus falls into a river in Nepal
32మంది మృతి, పలువురికి గాయాలు

కాఠ్మండ్ : నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 32మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ముగు జిల్లా ఛాయానాథ్ రేరా పట్టణం సమీపంలోని పీనాఝ్యారీ నదిలోకి బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 32మంది చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 300 మీటర్ల దిగువన ఉన్న నదిలోకి బస్సు పడిపోయిందని, దాంతో మృతుల సంఖ్య అధికంగా ఉన్నదని అధికారులు తెలిపారు. నేపాల్‌గంజ్ నుంచి గాంగాధీకి వెళ్లున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. దసరా ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు చేరుకుంటున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. బాధితులను నది నుంచి బయటకు తీయడం కోసం రెస్క్యూ బృందాలను అక్కడికి పంపించారు. తీవ్రంగా గాయపడిన పదిమందిని కోహల్‌పూర్‌లోని వైద్య కళాశాల ఆస్పత్రిలో, మరో ఐదుగురిని నేపాల్‌గంజ్‌లోని నర్సింగ్‌హోంలో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News