- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 8,04,026 చేరుకున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 74,919 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,342 కరోనా పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. ఎపిలో కరోనా మరణాలు 6,566కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31,469 యాక్టివ్ కేసులుండగా.. ఈ మహమ్మారి నుంచి 7లక్షల65వేల 991 మంది బాధితులు కోలుకని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 75,02,933మంది కరోనా బాధితులకు టెస్టులు చేసినట్టు ఎపి వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.
3342 New Covid-19 Cases Reported in AP
- Advertisement -