- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతరామన్ కాంగ్రెస్ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే అత్యాచారాలపై స్పందించే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఎందుకు స్పందించడం లేదని నిర్మాలా సీతారామన్ ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన ఘటనపై వారు మౌనంగా ఉంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఆ చిన్నారి కుటుంబానికి బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
- Advertisement -