Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ పెరిగిన పాజిటీవ్ కేసులు.. 4,120మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,727 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,120 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. అలాగే, కరోనా నుంచి 3,52,181మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. తాజా కేసుల్లో మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీగా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,37,03,665కు చేరుకుంది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 2,58,317మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 కరోనా యక్టీవ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,97,34,823మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

362727 New Corona Cases Report in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News