న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 37,148 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 587 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,55,191కి చేరింది. వీటిలో 4,02,529 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు దేశంలో 7,24,578 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28,084 మంది కరోనా బాధితులు మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
తెలంగాణలో ఇప్పటివరకు 46,274 మందికి కరోనా సోకగా… 422మంది ప్రాణాలు కోల్పోయారు. 34,323 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా… 11,530 మంది చికిత్స పొందుతున్నారు. ఎపిలో 53,724 మంది కరోనా బారిన పడగా… 696 మందిని కరోనా కబలించింది. అటు మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 3,18,695 మందికి కరోనా మహమ్మారి సోకింది. రాష్ట్రంలో 12,030 మంది చనిపోయారు. 1,75,029 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా… 1,31,334 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్నాటకలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఈ వైరస్ భయపెడుతోంది.
37148 Covid19 cases and 587 deaths reported in India/