Monday, May 6, 2024

దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

38079 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 38,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 560 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.10 కోట్లకు చేరుకోగా 1.43 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కోవిడ్ నిబంధనల అందరూ పాటించాలని, అలసత్వం వద్దని డబ్ల్యుహెచ్ఒ హెచ్చరించింది. 3.02 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా 4.24 లక్షల మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. 39.96 కోట్ల మంది టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 44 కోట్ల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News