Monday, April 29, 2024

మరోసారి స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Covid 19 cases reduced in india

న్యూఢిల్లీ : దేశంలో మరోసారి కరోనా కేసులు , మరణాలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 22,29,798 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 38,667 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. శుక్రవారం మరో 478 మంది మృతి చెందారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లకు చేరగా, మరణాలు 4.30 లక్షల మార్కును దాటాయి. ఈమేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. శుక్రవారం కరోనా నుంచి 35 వేల మంది కోలుకున్నారు. అయితే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండడం గమనార్హం. క్రియాశీల కేసులు 3,87,673 ఉండగా, ఆ రేటు 1.21 శాతానికి చేరింది. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,13,38,088 (97.45 శాతం) . మరో పక్క 63,80,937 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 53 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

38667 new covid-19 cases reported in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News