- Advertisement -
ఒడిశా: నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని బిస్వంత్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో లఖింపూర్కు చెందిన ముగ్గురు నర్సులు విధులు నిర్వర్తించేందుకు శనివారం రాత్రి ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఒకరిని పట్టుకోగా, మిగతా ముగ్గురు పారిపోయారు. పట్టుబడిన వ్యక్తిని వారు పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు.
4 Arrested for Sexually Harassing 3 Nurses in Assam
- Advertisement -