- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 73,767 నమూనాలు పరీక్షించగా 4,038పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,503కు చేరింది. కొత్తగా 38మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,357కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 5,622 మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40,047 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.ఇక, ఇప్పటివరకు 68,46,040 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
4038 New Corona Cases Registered in AP
- Advertisement -