Monday, April 29, 2024

దేశంలో మళ్లీ 40వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

41965 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో 460 మంది బాధితులు మరణించారు. ఇందులో ఒక్క కేరళలోనే 30,203 కేసులు నమోదవగా, 115మంది బాధితులు మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,39,020మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.గత 24 గంటల్లో కొత్తగా 33,964మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,19,93,644మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,78,181 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

41965 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News