- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు భారీగా పెగుతున్నాయి. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 443 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో 392 కేసులు ఎపిలో నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి పాజిటీవ్ వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా సోకింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9, 372కు చేరుకుంది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 4,826 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 4,435 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
443 New Corona Cases Reported in AP
- Advertisement -