Friday, April 26, 2024

దేశంలో మళ్లీ 40వేలకు పైగా కేసులు..

- Advertisement -
- Advertisement -

46164 New Corona Case Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 607మంది బాధితులు మరణించినట్లు తెలిపింది.  తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,25,58,530కు పెరిగింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,36,365మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 34,159మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 3,17,88,440 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,33,725 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 60.38 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది పేర్కొంది.

46164 New Corona Case Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News