- Advertisement -
అమరావతి: ఆంద్రప్రదేశ్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా అందులో 48 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,137కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారిలో 47మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 948 యాక్టివ్ కేసులున్నాయి.
1,142 మంది బాధితులు కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో కొత్తగా అనంతపురం- 3, చిత్తూరు-11, తూర్పు గోదావరి-4, గుంటూరు-12, కృష్ణా-3, కర్నూలు-7 చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 591 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
48 New Coronavirus Cases in Andhra Pradesh
- Advertisement -