హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6, గద్వాల 0, కామారెడ్డి 4, కరీంనగర్ 29,ఖమ్మం 24, ఆసిఫాబాద్ 7, మహబూబ్నగర్ 10, మహబూబాబాద్ 8, మంచిర్యాల 15, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్గిరి 33, ములుగు 12, నాగర్కర్నూల్ 9, నల్గొండ 18, నారాయణపేట్ 3, నిర్మల్ 10, నిజామాబాద్ 11, పెద్దపల్లి 15, సిరిసిల్లా 5, రంగారెడ్డి 35, సంగారెడ్డి 4, సిద్ధిపేట్ 7, సూర్యాపేట్ 13, వికారాబాద్ 8, వనపర్తి 2, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 28, యాదాద్రిలో మరో 13 మందికి వైరస్ సోకింది.
అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,78,599కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,69,828కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయితే మరో రెండు నెలల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్ ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరగకుంటే మేలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆయన అన్నారు.
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 62 లక్షల ఐదువేల 688 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అంటే ప్రతి పది లక్షల మందిలో ఏకంగా లక్షా 66 వేల, 729 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు వైద్యశాఖ చెబుతోంది.