Monday, April 29, 2024

కాబూల్‌లో బాంబు పేలుళ్లు: 55 మంది మృతి

- Advertisement -
- Advertisement -

55 Kills in Car bombing at Afghan school

 

కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బాలిక స్కూల్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పశ్చిమ కాబూల్‌లోని దుష్ట్-ఎ-బార్చి జిల్లాలో సయద్ అల్ షాదా స్కూల్ వద్ద మూడు సార్లు బాంబులు పేలడంతో 55 మంది బాలికలు మృతి చెందగా మరో 150 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి తీవ్రవాదులు చేసి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి తాము చేయలేదని తాలిబన్లు ప్రకటించారు. స్థానికులు ఆగ్రహాంతో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News