Monday, April 29, 2024

రెండు లక్షల 80 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

551 new Covid-19 case reported in Telanganacreased in Greater Hyderabad

కొత్తగా మరో 551 పాజిటివ్‌లు, ఒకరు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 111, జిల్లాల్లో 440 మందికి వైరస్
2,80,195 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 80 వేలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,80,195 మందికి వైరస్ సోకగా, ఏకంగా రెండు లక్షల 71 వేల 649 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు వెల్లడించారు. అంటే వైరస్ సోకిన ప్రతి వందలో సగటున 96 మంది సులువుగా కోలుకుంటున్నారని వైద్యశాఖ పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన ట్రీట్మెంట్‌ను అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతుంది.

ఇదిలా ఉండగా గురువారం 47,991 టెస్టులు చేయగా 551 మందికి వైరస్ తేలింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 111 మంది ఉండగా,ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 21, జగిత్యాల 11, జనగాం 7, భూపాలపల్లి 7, గద్వాల 2, కామారెడ్డి 3, కరీంనగర్ 24,ఖమ్మం 19, ఆసిఫాబాద్ 8, మహబూబ్‌నగర్ 9, మహబూబాబాద్ 10, మంచిర్యాల 15, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్‌గిరి 42, ములుగు 10, నాగర్‌కర్నూల్ 13, నల్గొండ 16, నారాయణపేట్ 1, నిర్మల్ 6, నిజామాబాద్ 14, పెద్దపల్లి 12, సిరిసిల్లా 7, రంగారెడ్డి 48, సంగారెడ్డి 23, సిద్ధిపేట్ 18, సూర్యాపేట్ 9, వికారాబాద్ 9, వనపర్తి 6, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 31, యాదాద్రిలో మరో 13 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,80,195కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,71,649కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ప్రతి పది లక్షల మందిలో లక్షా 70 వేల పరీక్షలు…

రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో లక్షా 70 వేల, 725 మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రతి రోజు చేసే టెస్టుల్లో 44 శాతం మంది ప్రైమరీ , 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నామని వైద్యశాఖ వెల్లడించింది. మరోవైపు ప్రతి రోజు ప్రభుత్వ టెస్టింగ్ కేంద్రాల్లోనే 97 శాతం పరీక్షలు నిర్వహిస్తుండగా, కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రైవేట్ కేంద్రాలకు వెళ్తున్నట్లు వైద్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News