హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,05,201 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 569 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,48,957కి చేరింది. మరో నలుగురు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,823గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 27 లక్షల 42 వేల 923 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 657 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,36,552 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,582 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.08 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 98,591 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో 6,610 మందికి పరీక్షలు చేశారు.
రాష్ట్రంలో కొత్తగా 569 కోవిడ్ కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -