- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 582 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,432 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,31,834కి చేరాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 1,311 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,11,912 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,611 యాక్టివ్ కేసులున్నాయి. 15,582 మంది బాధితులు హోంఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్ లో 174, నల్గొండలో 87, రంగారెడ్డిలో 55 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
582 New Covid 19 Cases Reported in Telangana
- Advertisement -