Monday, April 29, 2024

5G శకం ఆరంభం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్‌లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా

130 కోట్ల మంది భారతీయులకు
టెలికాం ఇండస్ట్రీ అద్భుత కానుక

న్యూఢిల్లీ: దేశంలో 5జీ శకం శనివారం ఘనంగా మైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ టెలికాం రంగంలో నూతన శకాన్నిప్రతిబింబించే 5జీ మొబైల్ సే వలను ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతిమైదాన్ లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. మైదాన్‌లో ఏ ర్పాటు చేసిన సేవలను వివరించే ప్రదర్శనను ప్రధాని తిలకించారు. రిలయన్స్ జి యో, వొడాఫోన్ ఐడియా, స్టాల్స్‌ను ప్రధాని సందర్శించా రు. 5జీ సేవల సామర్థానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జి యో చైర్మన్ ఆకాశ్ అంబానీ వివరించారు. అనంతరం 5జీ సేవల పనితీరును ప్రధాని స్వయంగా ప రిశీలించారు. సేవలు అందుబాటులోకి రావడంపై మంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ
దేశ టెలికాంలో కొత్త శకం ఆరంభమైందన్నారు.

తద్వారా అ పారమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన 1అక్టోబర్ 2022 ప్రత్యేకరోజు అని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 6వ ఎడిషన్ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని టెలికాం ఇండస్ట్రీ 130కోట్ల భారతీయులకు అద్భుతమైన కానుక 5జీగా ప్రధాని పేర్కొన్నారు. 2జీ, 3జీ, 4జీ టెలికాం సేవలు కోసం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై దేశం ఆధారపడేది అయితే సాంకేతిక పరిజ్ఞానంతో 5జీ సేవలు అందించి భారత్ చరిత్ర సృష్టించిందని మోడీ అన్నారు. తొలిసారి టెలికాం 5జీతో భారతదేశం అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పిందని చేశారు. కాగా కంటే అధికరెట్లు వేగంగా సమాచారాన్ని అందించే 5జీ..విద్య, వైద్య, వ్యవసాయ, పర్యవేక్షక రంగాల్లో విప్లవాన్ని తీసుకురానుంది. ప్రగతిమైదాన్‌లో నిర్వహించిన ఐఎంసికి మంత్రి వైష్ణవ్‌తోపాటు తరఫున అంబానీ, ఎయిర్‌టెల్ తరఫున భారతీ మిత్తల్, ఐడియా కుమార మంగళం బిర్లా 2030 నాటికి సేవలను వినియోగిస్తారని, 3జి సేవలు పదిశాతం కంటే తక్కువకు పడిపోతాయని ఇటీవల వెలువడిన నివేదికలో పేర్కొన్నారు.

ఎయిర్‌టెల్‌దే తొలి అడుగు…
8నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం

ఐదో తరంగా పిలిచే 5జీ సేవలను ముందుగా రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఎనిమిది నగరాల్లో ప్రారంభించింది. ముంబయి, ఎనిమిది నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని ఎనిమిది నగరాల్లో సేవలు శనివారం నుంచి అందిస్తున్నామని చైర్మన్ సునీల్ భారతి మిత్తల్ వెల్లడించారు. కాగా దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉన్న జియో నెలలోనే ఖాతాదారులకు 5జీ సేవలను అందుబాటులోకి అయితే వొడాఫోన్ ఐడియా ఇదమిత్థంగా తమ ఖాతాదారులకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేది స్పష్టం చేయలేదు. టెలికాం రంగంలో విప్లవం సృష్టించనున్న 5జీ సేవలు రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందజేస్తామని జియో హామీ ఇవ్వగా మార్చినాటికి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 4జీతో పోలిస్తే 5జీ ఏడు నుంచి పదిరెట్ల వేగవంతంగా సేవలు లభిస్తాయి. మూడు ప్రైవేటు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. కోట్లు, ఎయిర్‌టెల్ రూ.43,-084 కోట్లు, వొడాఫోన్ కోట్లు కొనుగోలు చేశాయి. అక్టోబరులోనే 5జీ సేవలు తీసుకువస్తామని జియో, ఎయిర్‌టెల్ ఇంతకుముందే ప్రకటించాయి. కాగా ఇండియా కాంగ్రెస్ (ఐఎంసి)ని ఆసియాలోనే టెలికాం, వేదికగా పరిగణిస్తారు. ఐఎంసిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తుంది.

నాలుగు స్తంభాలపై డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియా నాలుగు స్తంభాలపై ఏర్పడిందని మోడీ తెలిపారు. డివైజ్ ధర, కనెక్టివిటీ, కాస్ట్, ఫస్ట్ అప్రోచ్..డిజిటల్ ఇండియాకు నాలుగు స్తంభాలుగా పేర్కొన్నారు. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లు కేవలం రెండు మాత్రమే ఉంటే పైగా దీంతో ఫోన్ల ధరలు తగ్గాయని తెలిపారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా ఛార్జీలు భారత్‌లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 2014లో ఒక జీబీ డేటా రూ.300 ఉండగా ప్రస్తుతం జిబి డేటా లభిస్తుందన్నారు. సగటున నెలకు వినియోగిస్తున్నారని ఖర్చు నుంచి తగ్గిందన్నారు. అదేవిధంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగారన్నారు. డిజిటల్ పేమెంట్లు పెరిగాయని సాంకేతికత నిజంగా ప్రజాస్వామికంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు.

నాటికి
5జి సేవలు: ముకేశ్
దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ జియో టెలీఫోన్ సేవలను డిసెంబర్ నాటికి వస్తాయని చైర్మన్ ముకేశ్ అంబానీ శనివారం తెలిపారు. అత్యాధునిక హైస్పీడ్ ఇంటర్నెట్‌ను దేశంలోని ప్రతి మూలకు అందజేస్తామని ముకేశ్ వెల్లడించారు. టెలీకాం సెక్టార్‌లోకి 2016 సెప్టెంబర్‌లో జియో ప్రవేశించిందని, ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు ఖర్చుతో డేటా అందించి వినియోగదారులకు సేవలందించామని వివరించారు. 5జి సేవలు కూడా పట్టణం,ప్రతి తాలుకాలో ఆమోదయోగ్యమయ్యే ఖర్చుతోనే అందిస్తామని ఇస్తున్నామని సమావేశంలో అంబానీ వెల్లడించారు. కాగా ఆగస్టులో జరిగిన వాటాదారుల సమావేశంలో దీపావళినాటికి ముంబయి, ఈ నాలుగు నగరాల్లో 5జి సేవలు ప్రారంభిస్తామని

5జీ లైవ్ డెమోలో ముర్ము స్కూలు విద్యార్థులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో ఏర్పాటు చేసిన విద్యార్థులు సేవల డెమోలో పాల్గొన్నారు. శనివారం ప్రధాని మోడీ 5జీ సేవలను లాంఛ్ చేసిన తరువాత మూడు పెద్ద టెలికాం ఆపరేటర్లు 5జి సాంకేతిక సామర్థాన్ని మహారాష్ట్రలోని ముంబయి, ఒడిశాలో విద్యార్థులతో ఉన్న స్కూలు టీచర్‌కు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోను కనెక్ట్ చేశారు. స్కూలు విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోడీ సబ్జెక్టు ఏమిటని, విద్యాభ్యాసంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందని అడిగి తెలుసుకున్నారు. కాగా 5జి నెట్‌వర్క్ లైవ్ డెమోలో పాల్గొన్న తొలి స్కూలుగా మయూర్‌భంజ్ గ్రామంలోని మెమోరియల్ సిడెన్షియల్ స్కూలు నిలిచింది. రాష్ట్రపతి ముర్ము తన భర్త, ఇద్దరు కుమారుల జ్ఞాపకార్థం స్కూలును ప్రారంభించారు. లైవ్ డెమో కోసం స్కూలు క్యాంపస్‌లో టవర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News