- Advertisement -
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. పెగాసస్ అంశం, పెరిగిన పెట్రో ధరలు, రైతు చట్టాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ టిఎంసి ఎంపిలు సభలో ఆందోళనలకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిషాకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. చైర్ ఆదేశాలను ధిక్కరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించినందుకు ఆరుగురు టిఎంసి ఎంపిలను చైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు.
6 TMC MPs Suspended from Rajya Sabha
- Advertisement -