Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా 6250 మొక్కలు పంపిణీ..

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, కవిత దంపతుల చిన్న కుమారుడు వీర్ల జయంత్ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు వెలిచాల గ్రామ పంచాయితీలో ఇంటింటికి 5 మొక్కలు చొప్పున మొత్తం 6250 మొక్కలను పంపిణీ చేశాడు.

చిన్న వయసులోనే పర్యావరణముపై ప్రేమను పెంచుకొని ఎంపి సంతోష్ కుమార్ స్పూర్తితో మొక్కలు పంపిణీ చేయడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, ఉప సర్పంచ్ పుదరి వెంకటేష్, రైతు బందు సమితి జిల్లా సభ్యులు సంజీవ్ రావు, మాజీ సర్పంచ్ రవీందర్ రావు, వార్డ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News