Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 68 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,159మంది శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కోవిడ్ 19 నిర్ధారణ అయినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 1,639మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… రాష్ట్రవ్యాప్తంగా 53మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 715మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 కేసులు కోయంబేడు లింకులేనని అధికారులు తెలిపారు. ఎపిలో గత 24గంటల్లో 43 మంది డిశ్చార్జ్ కాగా… ఒకరు మృతి చెందారు. చిత్తూరులో -6, నెల్లూరులో-4, కొత్త కేసులకు కోయంబేడు లింకులు ఉన్నాయని ఎపి ఆరోగ్యశాఖ పేర్కొంది.

68 New Coronavirus Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News