Saturday, April 27, 2024

జనగామలో టూరిస్ట్ బస్సును ఢికొట్టిన లారీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

7 Injured in Road Accident in Jangaon

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు వైద్యచికిత్స కోసం యంజియం అసుపత్రికి తరలించారు. బాధితులు హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యంజియం వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు కమీషనర్ ను అడిగి తెలుసున్నారు. ప్రమాద బాధితులకు అవసమైన సహాయం అందించాలని సూచించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

7 Injured in Road Accident in Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News