అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,998 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 61మంది మృతిచెందారని తెలిపింది.దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 72,711కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 884కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 34,272మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 37,555మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రలో గత 24 గంటల్లో 58వేలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఎపిలో ఇప్పటివరకు 14 లక్షల 94వేల మందికి కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.
7998 New Corona Cases Registered in AP