Monday, April 29, 2024

తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌కు చెందిన ఒకటవ యూనిట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎన్టీపీసీ నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించేందుకు విభజన చట్టంలో ఒప్పందం కుదిరింది.

ఈ క్రమంలోనే రామగుండం ఎన్టీపీసీ వద్ద మొదటి దశలో 800 మెగావాట్లకు చెందిన రెండు సూపర్ క్రికిటల్ విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను చేపట్టారు. నిర్మాణం పనులు ప్రారంభించిన నాటి నుంచి అనేక సాంకేతిక ఇబ్బందులు, కరోనా లాంటి సమస్యలు ఎదుర్కోవడంతో నిర్మాణం పనులు తీవ్ర జాప్యం జరిగింది.

గత కొద్ది నెలల నుంచి తెలంగాణ ప్రాజెక్ట్‌కు చెందిన రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులను ఉద్యోగులంతా వేగవంతం చేసి ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చారు. ఆదివారం సాయంతం నుంచి ఒకటవ యూనిట్ నుంచి ఉత్పత్తి జరుగుతున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్‌కు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి జరుగుతున్న విద్యుత్‌ను 90 వాతం తెలంగాణ రాష్ట్రానికి అందజేస్తున్నారు.

మరో 2వ 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను కూడా మరికొద్ది రోజుల్లోనే ఉత్పత్తి దశలోకి తీసుకు రావడం కోసం సిద్ధం చేస్తున్నారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా జరగడంతో ఉద్యోగులు, అధికారులు స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు జరుపుకున్నారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి సకాలంలో విద్యుత్ ఉత్పత్తి జరిగేందుకు కృషి చేసిన ఉద్యోగులందరికీ హెచ్‌ఎంఎస్ రాష్ట్ర నాయకుడు సిహెచ్.ఉపేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News