Friday, May 10, 2024

జర్నలిస్ట్‌పై కాల్పులు.. 9మంది అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

9 Arrested due to Journalist Shot in UP

ఘజియాబాద్: సోమవారం రాత్రి ఘజియాబాద్‌లోని స్థానిక దినపత్రిక జర్నలిస్ట్‌పై హత్యా యత్నం జరిగింది. రాత్రి 1030 సమయంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న విక్రమ్‌జోషి అనే జర్నలిస్ట్ తలకు గురిపెట్టి కాల్పులు జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి మంగళవారం 9మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు జర్నలిస్ట్ కుటుంబసభ్యులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న నిందితులేనని పోలీసులు తెలిపారు. తమ మోటార్ సైకిల్‌ను కొందరు దుండగులు వెంటాడినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆ సమయంలో ఆయన వెంట ఆయన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం విజయ్‌నగర్‌లోని జోషి ఇంటికి సమీపంలోనే ఉన్నది. తీవ్రంగా గాయపడ్డ జోషి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తన మేనకోడలిని కొందరు వేధిస్తున్నారంటూ జులై 16న స్థానిక పోలీస్ స్టేషన్‌లో జోషి ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఈ సంఘటన జరిగింది. నిందితులపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్న కారణంతో స్థానిక స్టేషన్ ఇంచార్జిని సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్‌ఎస్‌పి నాయితానీ తెలిపారు.

9 Arrested due to Journalist Shot in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News