- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతి రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 4,944 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనాతో మరో 62 మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 58,668కు చేరుకుంది.ఇప్పటివరకు కరోనాతో 758 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో32,336 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 25,574మంది డిశ్చార్జ్ అయ్యారు.
4944 New Corona Cases Registered in AP
- Advertisement -