Friday, April 26, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ భిల్వారా జిల్లాలో సోమవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. భిల్వారా జిల్లా లో పెళ్లికి హాజరైన పెళ్లి బృందం తిరిగి మధ్యప్రదేశ్ లోని స్వగ్రామం సంధారాకు బస్సులో వస్తుండగా దారిలో జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. జీపులోని ఆరుగురు ప్రయాణికులతోపాటు మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా జిల్లా ఆస్పత్రిలో వీరికి చికిత్స జరుగుతోంది. పోస్టుమార్టమ్ తరువాత మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

9 Family Members Died in Road Accident in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News