Saturday, April 27, 2024

నగరంలో 9మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Telangana Police focus on control of blue videos

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఇన్స్‌స్పెక్టర్ బండారీ రవీందర్ కార్ఖానా ఎస్‌హెచ్‌ఓగా, అక్కడ పనిచేస్తున్న మధూకర్ స్వామిని స్పెషల్ బ్రాంచ్‌కు, స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న తుల వంశీకృష్ణ రావును సంతోష్ నగర్ ఎస్‌హెచ్‌ఓగా, వేయింటింగ్‌లో ఉన్న తూముకుంట శ్రీధర్‌ను అంబర్‌పేట డిఐ, భూమ వీరాప్రసాద్‌ను రేయిన్‌బజార్ ఎఐగా, మాల వెంకటమ్మను సిసిఎస్‌కు, యెలకపల్లి కమల్ కుమార్‌ను ఎఐ గోపాలపురం, నోముల వెంకటేష్‌ను ఎఐ తుకారాంగేట్‌గా నియమించారు. సంతోష్ నగర్ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న అంగోత్ భోజ్యను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన ఇన్స్‌స్పెక్టర్లు ఆయా స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

9 Inspectors Transfer in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News