- Advertisement -
హైదరాబాద్: ఫార్మా సిటీ కోసం తొమ్మిది వేలకుపైగా ఎకరాల భూమి సేకరించామని, ఫార్మా సిటీ కోసం మరికొంత భూమి సేకరించాల్సి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్మా సిటీ అడ్డుకోవడం కోసం కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. డిపిఆర్ను అధ్యయనం చేసిన తరువాతనే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని, ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశ్రమలు వినియోగించకపోతే ఆ భూములు వెనక్కి తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం పెద్ద ఎత్తున భూమిని సేకరించామని కెటిఆర్ తెలిపారు.
- Advertisement -