Saturday, April 27, 2024

కరోనాకు 95 పోలీసులు, 46 వైద్య సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

corona

 

బీజింగ్: కరోనా మహమ్మారిని తుదముట్టించడానికి సాగే పోరులో95 మంది పోలీస్‌లు, 46 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు చైనా అధికారికంగా శనివారం ప్రకటించింది. కరోనా బాధితులు, మృతుల జాతీయ స్మారక కార్యక్రమం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ కేసులు 81,639 కాగా, వీరిలో 3326 మంది మృతి చెందారని వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది కరోనా కేంద్రమైన హుబెయి ప్రావిన్సుకు దాని రాజధాని వుహాన్‌కు చెందిన వారే. గురువారం ప్రధాన పోలీసులు 60 మంది, సహాయ పోలీసులు 35 మంది పోలీసులు తమ విధుల్లో ప్రాణాలు కోల్పోయారని చైనా ప్రజా భద్రత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదే విధంగా వైద్య సిబ్బంది 46 మంది మృతి చెందారని , 3000 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు వెల్లడించింది. హుబెయిలో కరోనా కేసులు పెరగడంతో 42 వేల వైద్య సిబ్బందిని చైనా నియమించింది. 14 ఆస్పత్రులను ఏర్పాటు చేసింది.

 

95 police and 46 medical personnel died with corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News