- Advertisement -
చెన్నై : సకాలంలో వైద్య చికిత్స తీసుకుంటే కరోనా వల్ల జీవితం అంతం కాదని తమిళనాడుకు చెందిన 97 ఏళ్ల వృద్ధుడు నిరూపించాడు. చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన నిదానంగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జి కావడం ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఆనందం కలిగించింది. ఆయనకు చప్పట్లతో వైద్యులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. కరోనా పాజిటివ్ కనిపించడంతో ఆయన గత మే 30న కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జ్వరం, దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించడమే కాక రక్త పీడనం, గుండె జబ్బులు ఎదురై విషమ పరిస్థితి ఏర్పడింది. వైద్యచికిత్స అందిన ఐదారు రోజులకు ఆయన పరిస్థితి మెరుగైందని, నడవడం, మాట్లాడడం ప్రారంభించారని డాక్టర్ విజయలక్ష్మీ బాలక్రిష్ణన్ చెప్పారు.
- Advertisement -