- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 55,692 నమూనాలను పరీక్షించగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 82 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,64,142కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 2,378 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,70,924 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24గంటల్లో వచ్చిన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 1504 పాజిటివ్ కేసులున్నాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ వేగంగా జరుగుతోంది.
9996 new corona cases reported in andhra pradesh
- Advertisement -