- Advertisement -
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తెలింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామునుంచి అచ్చెన్నాయుడు జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కోవిడ్-19 టెస్టులు చేశారు. ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆసుపత్రి నివేదిక ఇస్తోంది. ఈ క్రమంలోనే అచ్చెన్నకు కోవిడ్ సోకడంపై హైకోర్టుకు లేఖ రాయనున్నట్టు సమాచారం. రమేశ్ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెలియడంతో ఆయన కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు.
TDP MLA Atchannaidu tests positive for corona
- Advertisement -