Thursday, May 9, 2024

ఆత్మీయ ఆలింగనంపై మంచు బ్రదర్స్ కామెంట్

- Advertisement -
- Advertisement -

 

‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అరుదైన సంఘటన ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుని ఆలింగనం చేసుకోవడంతో పాటు ఆయనను ముద్దుపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు… చిరంజీవితో తనకు గల అనుబంధం, తమ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడారు. దీనికి స్పందిస్తూ చిరంజీవి మోహన్‌బాబుని కౌగిలించుకోవడంతో పాటు ఆయనకు ముద్దు పెట్టారు. చిరు-మోహన్ బాబు ఆలింగనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మోహన్ బాబు- చిరు ఆలింగన్

ఈ ఇద్దరు లెజెండ్స్ ఎంతో ప్రశాంతంగా ఉన్నారని, మా తరానికి స్ఫూర్తిగా నిలిచారని మంచు విష్ణు, మంచు మనోజ్ తమ ట్విట్టర్‌లలో ఫొటోలను షేర్ చేశారు. అలాగే భవష్యత్తు తరాల వారికి కూడా స్ఫూర్తిని నింపుతారని అశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరు మధ్య ఉన్న స్నేహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రాక్స్ అని మంచి విష్ణు కొనియాడారు. బెస్ట్ పిక్ తో 2020 ప్రారంభమైందని మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) న్యూ ఇయర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో రాజశేఖర్ పరిస్థితిని వాడీవేడీగా మార్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగంపై రాజశేఖర్ కౌంటర్ వేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ‘మా’లో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. “మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉండే చెవిలో చెబుదాం”అని చిరంజీవీ ఇచ్చిన సలహాకు రాజశేఖర్ కౌంటర్ వేశారు. “నిప్పు దాచేస్తే దాగదు. పొగ వస్తూనే ఉంటుంది”అని మాట్లాడడంతో సభలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మధ్యలో మోహన్‌బాబు వారించబోయినా రాజశేఖర్ మాత్రం వినలేదు. తను చెప్పాలనుకున్నది చెప్పి దిగిపోయారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ “నేను చెప్పిన మాటను పట్టించుకోలేదు. ఎందుకీ పెద్దరికం”అని ప్రశ్నించారు. ప్రీ ప్లాన్డ్‌గా రాజశేఖర్ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చడానికి వచ్చాడంటూ చిరంజీవి అన్నారు. క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటే.. అతనిపై చర్చ తీసుకోవాలని సూచించారు.

Best pic to start of 2020 says Manchu Brothers

 

Best pic to start of 2020 says Manchu Brothers

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News