Wednesday, May 8, 2024

సెమీస్ లో సెరెనా జోడీ

- Advertisement -
- Advertisement -

Serena

 

ఆక్లండ్: ప్రతిష్టాత్మకమైన ఎటిపి అక్లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) జంట మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సెరెనా జంట 62, 61తో టాప్ సీడ్ జోహానా లార్సెస్ (స్వీడన్)కరోలైన్ డొలోహైడ్ (అమెరికా) జోడీని చిత్తు చేసింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సెరెనా జోడీ ఆరంభం నుంచే చెలరేగి ఆడింది. అగ్రశ్రేణి జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా తొలి సెట్‌ను గెలుచుకుంది. ప్రత్యర్థి జంట కనీస ప్రతిఘటన కూడా ఇవ్వడంలో విఫలమైంది. ఇక, రెండో సెట్‌లో సెరెనా జంట మరింత చెలరేగి పోయింది. దూకుడుగా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది.

Serena pairing in the semis
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News