కాన్పూర్: తనపై లవర్ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రశాంత్ అనే వ్యక్తి మార్బుల్ వ్యాపారం చేసేవాడు. ఓ మహిళకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పేవాడు. జనవరి 15న హోటల్కు రమ్మని సదరు మహిళకు ప్రశాంత్ కబురుపంపాడు. హోటల్లోని గదికి రాగానే ఆమెపై ప్రశాంత్ అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించింది. ఆమెను తీవ్రంగా కొట్టి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో ప్రశాంత్ స్నేహితుడుకు అంకిత్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే అంకిత్ అక్కడికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె రెయిల్ బజార్ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. నిందితుడుపై 506, 376 ఐపిసి సెక్షన్లు, అంకిత్పై 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.