Friday, May 17, 2024

యోగా సెంటర్ లో మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

 

రిషికేశ్: యోగా సెంటర్ లో 33 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తపోవన్ ప్రాంతంలోని రిషికేశ్ నాథ్ యోగాశాలలో నెల రోజుల నుంచి అమెరికాకు చెందిన సదరు మహిళ యోగా నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రిషికేశ్ నాథ్ యోగాశాలలో అటెండర్ గా పనిచేస్తున్న నిందితుడు గితాన్ష్ మార్చి 10వ తేదీన రాత్రి బాధితురాలికి ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలు ముని కి రెటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

US Woman raped at Yoga Centre by attendant in Rishikesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News