లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్ గా ఉంటున్నారు. పలు వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఓ ఫోటో షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ముఖ్యంగా బన్నీ, ఎన్టీఆర్ అభిమానులను ఈ ఫోటో తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. ఇందులో కాజల్, శ్రీను వైట్ల, అమలాపాల్, పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. బార్సిలోనాలో బాద్షా, ఇద్దరమ్మాయిలతో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అలా అందరం కలిసాం.. మళ్ళీ మీ అందరినీ కలవాలని ఆతృతగా ఉందంటూ కాజల్ ఫోటో పోస్ట్ చేసింది.
@SreenuVaitla @purijagan @alluarjun @tarak9999 @Amala_ams Look what I found 😍#baadshah #iddarammayilatho catch up in Barcelona. Can’t wait to see you all again! 🤗❤️ pic.twitter.com/97ktCSMGxX
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 3, 2020
kajal agarwal shares throwback photo with NTR, Bunny