- Advertisement -
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదం లక్నో శివార్లోని కకోరీ ప్రాంతంలోచోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
6 Dead in Head on Collision Between Two Buses in UP
- Advertisement -