గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్టు తరుణ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. గత కొద్దిరోజుల నుంచి అసోంలోనూ కరోనా కేసులు పెరుగుతూ లక్షలకు చేరువలో ఉన్నాయి. అసోంలో ఇప్పటివరకు 92,620మందికి కరోనా వైరస్ సోకింది. 252 మంది కరోనాతో మృతి చెందారు. 70,901 మంది ఈ వైరస్ కోలుకోని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 21,464 యాక్టివ్ కేసులున్నాయి.
Ex Assam CM Tarun Gogoi tests positive for Corona
I have been tested Covid 19 positive yesterday. People who came in contact with me during Last few days they should go for Covid test immediately.
— Tarun Gogoi (@tarun_gogoi) August 26, 2020