- Advertisement -
అమరావతి: గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఇప్పటికే నటుడు అర్జున్, బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఇప్తి చేశారు. తాజాగా బాలు కుమారుడు ఎస్పి చరణ్ కూడా దీనిపై స్పందిస్తూ.. ‘తన తండ్రికి భారతరత్న ఇస్తే సంతోషిస్తా’ అని పేర్కొన్నాడు. బాలసుబ్రమణ్యం తన కేరీర్ 16 బాషల్లో మొత్తం 40వేలకు పైగా పాటలు పాడారు. కాగా, కరోనాతో చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చేరిన బాలు మూడు రోజుల క్రితం చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
CM Jagan Writes PM Modi for Bharat Ratna to SP Balu
- Advertisement -