మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల క్రితమే రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పాత షూటింగ్స్ ఆగిపోవడం, కొత్తవి మొదలుకాకపోవడంతో ఈ సినిమా కూడ ప్రారంభం కాలేదు. కానీ ఇప్పుడిపుడే షూటింగ్స్ మొదలవుతుండటం, త్వరలో థియేటర్లు తెరుచుకోనుండటంతో వీరి సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నెల మూడవ వారంలో ఈ సినిమా లాంచ్ కానుందని తెలిసింది. రవితేజతో రమేష్ వర్మ గతంలో ‘వీర’ సినిమా చేయడం జరిగింది. అలాగే ఇటీవలే ఆయన ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఈ పాత్రల కోసం నిధి అగర్వాల్, రాశీఖన్నాలను అనుకుంటున్నారట. ఈ విషయమై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఈ చిత్రం రవితేజ ట్రేడ్ మార్క్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్గానే ఉండనుంది. ఇకపోతే ఈ హీరో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు.