- Advertisement -
దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టు రాజస్థాన్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72 నాటౌట్), పడిక్కల్(63) అర్థ సెంచరీలతో రాణించారు.
IPL 2020: RCB Won by 8 wickets against RR
- Advertisement -