మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి అనూహ్యంగా స్పందన వస్తోంది. పార్టీ పరంగా 100 అంబులెన్స్లు సమకూర్చాలనే లక్షంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం లక్ష్యానికి చేరువవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రగతి భవన్లో వివిధ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులు, మంత్రులు, టిఆర్ఎస్నాయకులు సొంత ఖర్చులతో సమకూర్చిన 21 అంబులెన్స్లకు మంత్రి,టిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
వీటిలో మంత్రులు ఈటల రాజేందర్ , మల్లారెడ్డి , శీనివాస్ గౌడ్, నింరజన్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంపి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సి పట్నం మహేందర్ రెడ్డి సొంతఖర్చులతో అందించిన అంబులెన్స్లు ఉన్నాయి. అలాగే శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, న్నన్నపనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి,ఆఊరి రమేష్. చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్కు చెందిన లక్ష్మణరావు సొంతఖర్చులతో అందించిన అంబులెన్స్లు ఉన్నాయి. ఈ అంబులెన్స్లు మహబూబ్నగర్,హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్,ఖమ్మం జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు వినియోగించనున్నారు.