- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : సినీనటుడు డా రాజశేఖర్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గడంతో సోమవారం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా అక్టోబరు నెలలో ఆయన ఫ్యామిలీకి కరోనా సోకగా, తన కూతుళ్లు, భార్య జీవితకు క్వారైంటైన్ కాల వ్యవధిలోనే వైరస్ తగ్గిపోయింది. కానీ రాజశేఖర్కు స్పల్ప స్థాయిలో ఆక్సిజన్ అవసరముండగా సిటీ న్యూరో వైద్యులు ఐసియూలో ఉంచి వైద్యం అందించారు. దాదాపు 20 రోజులకు పైగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో ఆయనను ఇంటికి పంపించినట్లు డాక్టర్లు తెలిపారు. మరో పది రోజుల పాటు వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతోందని సిటీ న్యూరో డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆయన డిశ్చార్జ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కాగానే ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -