- Advertisement -
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 97 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 292 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆరో వికెట్పై వాషింగ్టన్ సుందర్, శార్థూల్ టాగూర్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో సుందర్(50), టాగూర్లు(56) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ (44), మయాంక్ అగర్వాల్(38), రహానే(37), ఛటేశ్వర్ పూజారా (25), రిషబ్ పంత్(23), గిల్(07) పరుగులు చేసి ఔటయ్యారు ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా స్టార్క్ , కమ్నీస్, నాథన్ లయన్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
- Advertisement -